సంతానం కలగలేదనే మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య.. కానుగ చెట్టుకు ఉరేసుకుని..

సంతానం కలగలేదనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దెప్పిపొడుపు మాటలు తట్టుకోలేక ఆ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా, గుడిబండ మండలంలోని హెచగొల్లహట్టి గ్రామానికి చెందిన చిక్కన్న(28) సంతానం లేదనే మనస్తాపంతో ఉరివేసుకున్నాడు. చిక్కన్నకు ఐదేళ్లకు అదే గ్రామానికి చెందిన కవితతో వివాహమైంది. 

దాంపత్య జీవనం అన్యోన్యంగా సాగినా.. సంతానం కలగకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన చిక్కన్న.. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి కుటుంబ సభ్యులకు చెప్పకుండా వెళ్లిపోయాడు. అతని కోసం వెతికినా ఆచూకీ తెలియలేదు. 

ఆదివారం గొర్రెలు కాపర్లు గ్రామ సమీపంలోని కానుగ చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. భార్య కవిత, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఇదిలా ఉంటే.. నల్గొండ జిల్లాలోని తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో శనివారం మధ్యాహ్నం దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యను అతి దారుణంగా గొడ్డలితో నరికిన ఓ భర్త, తన మూడేళ్ల కూతురుని తీవ్రంగా గాయపరిచి, ఆపై తన ఎనిమిది నెలల చిన్నారిని ఎత్తుకుని విద్యుత్తు షాకు పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Share on Google Plus

About Surekha Vani

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment

0 comments:

Post a Comment